స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Sakshitha news

స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అసభ్య, అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్‌ను, ఆయన కుటుంబాన్ని అవమానించడం ఏ సంస్కృతి? దళితుడైన స్పీకర్‌పై ఇలాంటి వివక్ష, అహంకారపూరిత వ్యాఖ్యలు దురదృష్టకరం.

తాతా మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయన చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.

దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
బీఆర్ఎస్‌కు ప్రజలే తగిన సమాధానం చెబుతారు