వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
.
సికింద్రాబాద్ : నిరుపేదలకు వైద్య సాయాన్ని అందించేందుకు తాము నిరంతరం సిద్దంగా ఉంటామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన స్టాలిన్, వారాసిగుడా కు చెందిన బీ పాషా లు అనారోగ్యం బారిన పడి వైద్య సాయానికి సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయించారు. వెంటనే ఎం.ఎల్.ఏ. తీగుల్ల పద్మారావు గౌడ్ చొరవ తీసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.రెండు లక్షల చొప్పున రూ.నాలుగు లక్షల మేరకు ఎల్.ఓ.సీ. పత్రాలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చి గురువారం తన కార్యాలయంలో అందింజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు తమ సితాఫలమండీ లోని తమ కార్యాలయం బాసటగా నిలుస్తుందని తెలిపారు. గత పదేళ్ళ కాలంలో రికార్డు సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పేదలకు అందించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వైద్య సాయానికి నిత్యం సిద్దం : ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్
Related Posts
గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను
SAKSHITHA NEWS గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ అభ్యర్థులకు బీఆర్ఎస్ తరపున అండగా ఉంటాం అని భరోసా ఇచ్చిన కేటీఆర్…
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
SAKSHITHA NEWS ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్ హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామని, రాచకొండ సిపీ…