SAKSHITHA NEWS

మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నేడు విచారణ

తెలంగాణ రాజకీయాల్లోనూ సినీ ఇండస్ట్రీలోనూ మంత్రి కొండ సురేఖ సంచలనగా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండ సురేఖ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక మెజిస్ట్రేట్‌‌ కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు కేటీఆర్.. సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతో సహా 23 రకాల ఆధారాలను కేటీఆర్‌‌‌‌ తరఫు న్యాయవాది కోర్టుకు అందించారు…

ఈ కేసులో సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ పేర్కొ న్నారు. కేటీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరిం చింది. దీంతో ఇవాళ జరిగే విచారణపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ ఇండస్ట్రీలోనూ ఉత్కంఠ నెలకొంది..


SAKSHITHA NEWS