SAKSHITHA NEWS

తండ్రిని పట్టించుకోని కొడుకులకు ఆర్డీఓ షాక్

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు రాజమల్లు ఆస్తిని ఇద్దరు కొడుకులు తీసుకున్నారు.. రాజమల్లుకు వచ్చిన డబుల్ బెడ్ రూంను పెద్ద కొడుకు భార్య పేరుపై రాయించుకున్నాడు.

ఆస్తి తీసుకొని ఇద్దరు కొడుకులు రాజమల్లును పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేసుకుంటున్నాడు.

ఇటీవల వృద్ధుడు ఫిర్యాదు చేయడంతో కోడలు పేరుపై ఉన్న డబుల్ బెడ్ రూంను తిరిగి రాజమల్లుపై ఎక్కించి, కొడుకులు నెలకు ₹2000 ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించాడు…


SAKSHITHA NEWS