SAKSHITHA NEWS

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ కు ఆత్మ చెప్పిందేమో

జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం

అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం

ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు

జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం

కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిః రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు గారు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారు. ఇప్పుడు టీసీఎస్ విషయంలో జగన్ కు ఆత్మ చెప్పినట్లుంది.. ఆయనే తీసుకువచ్చాడని. జగన్ రెడ్డి పాలనలో ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో బహిర్గతం చేయాలి. 2014-19 మధ్య 44వేల పరిశ్రమల ఏర్పాటుతో పాటు 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు స్వయంగా వైసీపీ ప్రభుత్వమే శాసనమండలిలో ఒప్పుకుంది. నేడు చంద్రబాబుగారు వచ్చిన తర్వాతనే ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే టీసీఎస్, లులు వచ్చాయి. అనేక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో జగన్ రెడ్డి తరిమివేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం.

అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సర్వీసింగ్ ఉత్తరాంధ్రకు తీసుకువస్తాం. విండ్, సోలార్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు కర్నూలుకు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ కడప, చిత్తూరుకు, ఆటోమొబైల్స్ అనంతకు తీసుకువస్తాం. ఉభయగోదావరికి ఆక్వా, పెట్రో కెమికల్ పరిశ్రమలు తీసుకువస్తాం. కృష్ణా, గుంటూరులో అనేక పెట్టుబడులు తీసుకువస్తాం. పరిపాలన కేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం.

బుక్ ల విషయంలో నన్ను చూసి ఇన్ స్పైర్ అయినట్లుంది
బ్లూ బుక్, గుడ్ బుక్ అంటున్న వైసీపీ .. తనను చూసి ఇన్ స్పైర్ అయినట్లు ఉంది. పాదయాత్రలో వంద బహిరంగ సభల్లో మాట్లాడాను. రెడ్ బుక్ చూపించి.. చట్టాన్ని ఉల్లంఘించి, ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులు, వైసీపీ నాయకులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇప్పటికే యాక్షన్ మొదలైంది. వైసీపీ వేరే పుస్తకాలు పెడితే పెట్టుకోనివ్వండి.. మాకేం భయం లేదు.

ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు
వరదసాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. దాదాపు 10 రోజులకు పైగా చంద్రబాబునాయుడు గారు, మంత్రివర్గం మొత్తం ముంపుప్రాంతాల పనులు పర్యవేక్షించారు. ఆనాడు వైకాపా ఎక్కడుంది? వరద బాధితులను ఆదుకునేందుకు కోటి సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలి. మేం వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టాం. రీహాబిలిటేషన్ యుద్ధప్రాతిపదికన చేపట్టాం. సుమారు రూ.650 కోట్లు ఖర్చుపెట్టాం. ఏవైనా లోటుపాట్లు ఉంటే, సాయం అందకపోతే వివరాలు ఇవ్వాలి. దీనిపై చర్యలు తీసుకుంటాం. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ మాదిరిగా మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. వరదలు వస్తే జగన్ కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటలేదు. వాస్తవాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు వాస్తవాలు తెలుసు. మేం న్యాయబద్ధంగా వెళ్తాం.

జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం
జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్లనివ్వండి. ఆయన మాదిరిగా మేం గేట్లకు తాళ్లు కట్టబోం. గతంలో చంద్రబాబు గారు ధర్నా చేయాలంటే అనుమతులు కూడా ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజల్లోకి వెళ్లవచ్చు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. అన్నీ పద్ధతి ప్రకారం చేస్తాం. మంగళగిరిలో ఎయిమ్స్ కు నీటి సరఫరాతో పాటు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే చేపడతాం. మూడు నెలల్లో మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడతాం. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తాం. పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. సనాతన ధర్మ బోర్డు విషయంలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రోడ్ల నిర్మాణం కూడా త్వరలోనే చేపడతాం. ఐదేళ్లలో రోడ్లను వైసీపీ పట్టించుకోలే.


SAKSHITHA NEWS