SAKSHITHA NEWS

సవాయిగూడెం గ్రామంలో దుర్గామాత కు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దంపతులు

*సాక్షిత వనపర్తి :
దసరా నవరాత్రుల సందర్భంగా వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామం రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యములో ప్రతిష్టించిన మహిషాసుర మర్దిని అవతార అమ్మవారిని వనపర్తి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు.అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అన్నధానకార్యక్రమం చేపట్టారు ప్రతి రోజు అన్న ధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు
ఈ సందర్భంగా విజయ దశమి దసరా సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో , ఐక్యమత్యంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మ వారిని కోరుకున్నారు.
ఈ సందర్భంగా పూజలో అమ్మవారిని ప్రతిష్టించిన ఆలయ కమిటీ సభ్యులు. పూజ లో పాల్గొన్న వారు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ డేగ మహేశ్వర్ రెడ్డి స్వాములు గురుస్వామీ ప్రశాంత్ రెడ్డి వర్ధన్ గౌడ్ శివారెడ్డి వంశీ కన్నా.సవాయిగూడెం గ్రామ ప్రజలు
తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS