SAKSHITHA NEWS

సవాయిగూడెం గ్రామంలో దుర్గామాత కు ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS మండల అధ్యక్షులు మాణిక్యం దంపతులు
సాక్షిత వనపర్తి

నవరాత్రుల సందర్భంగా సవాయిగూడెం రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యములో గురువారం ప్రతిష్టించిన దుర్గామాత అవతార అమ్మవారిని బి.
ఆర్.ఎస్ మండల అధ్యక్షులు మాణిక్యం దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు.అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అన్నధానకార్యక్రమం చేశారు ప్రతి రోజు అన్న ధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు
ఈ సందర్భంగా విజయ దశమి దసరా సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో , ఐక్యమత్యంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మ వారిని కోరుకున్నారు.


ఈ సందర్భంగా పూజలో అమ్మవారిని ప్రతిష్టించిన ఆలయ కమిటీ సభ్యులను మండల అధ్యక్షులు మాణిక్యం అభినందించారు. పూజ లో పాల్గొన్న వారు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ డేగ మహేశ్వర్ రెడ్డి స్వాములు గురుస్వామీ ప్రశాంత్ రెడ్డి వర్ధన్ గౌడ్ శివారెడ్డి వంశీ కన్నా.సవాయిగూడెం గ్రామ ప్రజలు
తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS