SAKSHITHA NEWS

విద్యార్థులచే సరస్వతీ పూజ

సాక్షిత ( తిరుపతి జిల్లా)
రామచంద్రాపురం
శరన్నవరాత్రులల్లో భాగంగా మూలా నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినమును పురస్కరించుకొని మండలంలోని గొల్లపల్లి లో ఉన్న సురభి గో సంరక్షణ శాలలో బుధవారం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులచే సరస్వతీ పూజ నిర్వహించారు అనంతరం పూజలోని ప్రతి ఉపచారము యొక్క విశిష్టతను పిల్లలందరికీ వివరించారు. అమ్మవారికి నివేదన చేసిన ప్రత్యేకమైన ప్రసాదమును పిల్లలందరికీ అందించారు. అనంతరం అంగరంగ వైభవంగా అమ్మవారు గోశాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. తదుపరి భక్తులచే దర్బార్ సేవ, కుంకుమ అర్చనలు జరిగాయి. భక్తి పాటలు కచేరి జరిగింది చివరగా భక్తులకి తీర్థప్రసాదాలు అన్నదానం నిర్వహించారు.


SAKSHITHA NEWS