SAKSHITHA NEWS

శ్రీ రామ్ మందిర్ సేవ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు…
సాక్షిత : మల్కాజ్గిరి లోని జీడి సాయి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ రామ్ మందిర్ సేవ మండల్ వారి 8వ వార్షిక నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగ నిర్వహిస్తున్నారు…

ఈ సందర్భంగా సేవా మండల్ సభ్యులు జీడి సాయికుమార్ గౌడ్, రామచందర్ లు మాట్లాడుతూ…ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకరణలో అలంకరించి ఎంతో భక్తి భావంతో భవాని దీక్షలు తీసుకున్న వారు అమ్మవారిని పూజించడం… కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్న వారికి వారితోపాటు భక్తులకు ఉదయం అన్న సంతర్పణ కార్యక్రమం.. సాయంత్రం అల్పాహారం దాదాపుగా 500 మంది వరకు రోజు పాల్గొంటున్నారని.. అందరి సహకారంతో అమ్మవారి పరిపూర్ణ కరుణా కటాక్షంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారని తెలిపారు….

ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయికుమార్ గౌడ్, బాలచందర్ గౌడ్, ఈటల వికాస్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, చరంజీట్ గౌడ్, శ్రీధర్ భవాని, సోమలింగం భవాని, ప్రదీప్, కృష్ణ భవాని ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS