SAKSHITHA NEWS

పబ్లిక్ ప్లేస్ లలో స్వచ్ఛతా హి క్లీన్ అండ్ గ్రీన్

సాక్షిత శంకర్‌పల్లి: స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని పార్క్ లు, పబ్లిక్ ప్లేస్ లు, మూసి వాగు బ్రిడ్జి దగ్గర మాస్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాల్టీ పరిసరాలను పరిశుభ్రంగా
ఉంచాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరి పై ఉన్నదని ఆమె పేర్కొన్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ చేత వేయడం వలన మున్సిపాల్టీ మొత్తానికి చెడ్డ పేరు
వస్తున్నదని ప్రజలందరూ కూడా తమ ఇంటి వద్దకు వచ్చే ఆటోలోనే చెత్తను వేయాలని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్,
మేనేజర్ అంజన్ కుమార్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ ఆనంద్, సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS