SAKSHITHA NEWS

ఏపీలో మహిళలకు త్వరలో ఫ్రీ బస్సు.. మంత్రి కీలక ప్రకటన

ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.

దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.

డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10
లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు.

అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేద ప్రజలకు మూడు పూటలా ఆహారం సమయానికి అందుతుందని మంత్రి అన్నారు.


SAKSHITHA NEWS