SAKSHITHA NEWS

సాయిచంద్ కు ఘనంగా నివాళులు అర్పించిన బి.ఆర్.ఎస్.

*సాక్షిత వనపర్తి:
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మెన్ కీర్తిశేషులు సాయిచందు జయంతి సందర్భంగా పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ సాయిచంద్ దళితబిడ్డగా పుట్టి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.


సాయిచందు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపన్యాసాలు విని ప్రభావితమై తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కొనియాడారు .
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి,కౌన్సిలర్స్ బండారు.కృష్ణ, నాగన్న యాదవ్, కంచె.రవి కో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్,మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహేబ్ హుస్సేన్,డ్యానియాల్,నీల స్వామి, ఉంగ్లమ్. తిరుమల్ ,A.K.పాషా, ఆరీఫ్,రాంచందర్,వజ్రాల.రమేష్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS