SAKSHITHA NEWS

టీఎస్ జెన్కో ఏ ఈ గా శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన సరికొండ సూర్య గణేష్ రాజు 2017- 18 విద్యా సంవత్సరంలో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నందు పదో తరగతి లో అత్యధిక మార్కులు సాధించి ఉత్తీర్ణులైనారు. పాఠశాల ఫౌండర్ గారైన ఇనుకుల దివాకర్ రెడ్డి ప్రోత్సాహంతో డిప్లమా నందు ఈఈఈ లో ఉత్తీర్ణత సాధించి ,బీటెక్ పూర్తి చేసినారు. మొదటి ప్రయత్నంలోనే టీ ఏస్ జన్కోలో ఏఈ గా ఉత్తీర్ణత సాధించారు. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపించిన సూర్య గణేష్ రాజుకు పాఠశాల ఫౌండర్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి అభినందనలు తెలియజేసినారు. పాఠశాల కరస్పాండెంట్ అయిన వాహిని మేడం, సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందించారు.


SAKSHITHA NEWS