SAKSHITHA NEWS

నేడు స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో పాల్గొననున్నసీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ :
తెలంగాణ సచివాలయంలో సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి,సమీక్ష సమావేశం నిర్వహించను న్నారు.

సమీక్ష అనంతరం మధ్యా హ్నం 2 గంటలకు తెలంగా ణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం పాల్గొననున్నారు..

స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారని.. అందుకే ఐటిఐలను అడ్వా న్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చ బోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఇవాళ పారిశ్రామిక వేత్తలతో ఆనం ద్ మహేంద్ర సమావేశం అవుతారని నిన్న జరిగిన ఎంఎస్‌ఎఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు.


SAKSHITHA NEWS