SAKSHITHA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు…

సాక్షిత : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా కమిషనర్ డి.సౌజన్ , ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,గీతాలాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ , రాఘవేంద్ర రావు,రాజేశ్వరి వెంగయ్య చౌదరి, గాజుల సుజాత, ఆవుల పావని జగన్ యాదవ్, వెంకటరామయ్య, శ్రీ రాములు, కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్ ,సీనియర్ నాయకులు, ఎన్ఎంసి ఆయా విభాగం అధికారులు మరియు సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS