SAKSHITHA NEWS

రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఆహార పొట్లల పంపిణీ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్నేరు పరివాహక ప్రాంత వరద బాధితులకు ఆహార పొట్లలను సోమవారం పంపించేశారు. పెద్దతండా, ధంసలాపురం, అగ్రహారం తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందికి పైగా బాధితులకు ఆహారపోట్లలు , మంచినీటి పాకెట్లను అందించారు. జిల్లా వ్యాప్తంగా తమ అకాడమీ ఆధ్వర్యంలో బాధితులకు కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాలను పంపిణీ చేస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు.


SAKSHITHA NEWS