SAKSHITHA NEWS

వర్షాల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: ఆగస్టు 31: వర్షాల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం వర్షాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులకు ఆయన సూచనలు చేశారు. మట్టి మిద్దెలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండవద్దని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా వెళ్లరాదని సూచించారు


SAKSHITHA NEWS