SAKSHITHA NEWS

మొసలి కథ సుఖాంతం: దేవరచెరువు వద్ద భయాందోళనకు తెర!

మల్దకల్: మండల కేంద్రంలోని దేవరచెరువు వెనుక పొలంలో ఉదయం కనిపించిన మొసలి భయాందోళనలకు కారణమైంది. పొలంలో పనిచేస్తున్న కూలీలు మొసలిని చూసి భయంతో వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలిని పట్టుకునే ప్రయత్నం చేసేలోపే, అది పరిసరాల్లోని ఒక బావిలోకి పడిపోయింది. అనంతరం రైతుల సహకారంతో అటవీ సిబ్బంది బావి నుంచి మొసలిని బయటకు తీసి, నదిలోకి వదిలినట్లు సమాచారం.


SAKSHITHA NEWS