SAKSHITHA NEWS

టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయుడు -మేయర్ డాక్టర్ శిరీష

*సాక్షిత : *ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగర పాలక కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన -నగర మేయర్ డాక్టర్ శిరీష…

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయుడు అని, స్మరించుకోవడం మన బాధ్యతని నగర మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శప్రాయుడు అని, నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 1950లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగుందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒక్కడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయక పాత్ర పోషించాడు. వారిని సన్మానించుకోవడం మన బాధ్యతని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్.సి. మునికృష్ణ, నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య,డి.సి.పి. శ్రీనివాసన్ రెడ్డి,రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మేనేజర్ చిట్టిబాబు, డి.ఈ.రవీంద్రనాథ్ రెడ్డి, సూపర్డెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS