SAKSHITHA NEWS

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు
మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడు పడుతాయనేది క్లారిటీ లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దీంతో వినియోగదారులకు సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి సబ్సిడీ పైసలు జమ కావటంతో పాటు, ఫోన్లకు మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.


SAKSHITHA NEWS