SAKSHITHA NEWS

సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీ

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కలకత్తా లో మహిళా డాక్టర్ మీద జరిగిన దారుణానికి నిరసనగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట ఏరియా హాస్పటల్ నుండి పియస్ ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.

సుమారు పది రోజులుగా సూర్యాపేట డాక్టర్లు నిరసనలు,ధర్నాలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ చాందిని రెడ్డి ,డాక్టర్ శ్రీధర్, డాక్టర్ అయేషా , డాక్టర్ కాకి పృధ్వీ కళ్యాణ్, డాక్టర్ జునైద్ మొహినుద్దీన్, బ్లడ్ సోల్జర్స్అద్యక్షుడు నసీర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS