SAKSHITHA NEWS

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉండగా, ఖాళీ చేయిస్తున్నట్లు వెల్లడించారు.


SAKSHITHA NEWS