SAKSHITHA NEWS

మానవత్వం చాటుకున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు
ఆర్దిక ఇబ్బందుల్లో విద్యార్థి – ఉన్నత చదువుల‌ కోసం 10,000/- సహాయం
……………………………………………
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ నందు 45వ వార్డులో నివాసం వుంటున్న పిల్లలమర్రి రేణుక, శ్రీనివాస్ ల కుమారుడు హైదరాబాద్ నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ మొదటి సంవత్సరం చదవడానికి ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ వార్డులో ప్రజలకు ఎల్లవేళలా అండగా వుంటూ తన వంతు సహాయం చేస్తున్న గండూరి క్ర్రపాకర్ 10,000/- రూ “లను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు. వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో వుంటూ అవసరమున్న వారికి సహాయం అందించే మంచి మనసున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులకు వార్డు ప్రముఖులు ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.


SAKSHITHA NEWS