SAKSHITHA NEWS

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని వదలం.. మంత్రి నారాయణ స్పష్టీకరణ

వైసీపీ(YSRCP) హయాంలో తీవ్ర స్థాయిలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని మంత్రి నారాయణ(Minister Narayana) ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్ ఇళ్ల నిర్మాణంపై అనేక వినతులు వస్తున్నాయి. జగనన్న లేఔట్ల సమస్యలపై విచారణ జరిపి పరిష్కారం చూపుతాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టం. వైసీపీ హయాంలో తీవ్రంగా ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఎంతటి వారిపైనైనా విచారిస్తాం. తణుకులో టీడీఆర్ బాండ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. ఈ అక్రమాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే విచారణ కమిటీ వేశాం. నివేదిక కూడా వచ్చింది. సీఎంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాం” అని నారాయణ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS