SAKSHITHA NEWS

మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.

సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం రెవెన్యూ లోని పెద మొల్లోడు గెడ్డ పరివాహక ప్రాంతం లోని ఆక్రమణను రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తొలగించారు.51 సర్వే నెంబర్ లోని గెడ్డ స్థలం సుమారు 30 సెంట్లు వరకూ ఆక్రమించి ఓ భూ కబ్జాదారుడు గెడ్డను కబ్జా చేసాడు.

ఏకంగా గెడ్డను కప్పేసి పక్కనున్న తన సొంత భూమిలో కలుపుకున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రెండ్రోజుల క్రితం సర్వేయర్తో సర్వేయించి గెడ్డ ఆక్రమణకు గురయినట్లు గుర్తించారు. ఈ మేరకు జెసిబిని తీసుకెళ్లి ఆక్రమణను తొలగించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అక్రమదారుని పై అధికారులు ల్యాండ్ గ్రాభింగ్ కేసు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


SAKSHITHA NEWS