SAKSHITHA NEWS

తెలంగాణలో 8 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ధార కవిత, మల్కాజిగిరి-భువనగిరి ఎస్ఓటీ డీసీపీగా రమణారెడ్డి, ఆక్టోపస్ ఎస్పీ అడ్మిన్గా ఎం వెంకటేశ్వర్లు, మాదాపూర్ ఎస్ఓటీగా డి. శ్రీనివాస్, సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా శ్రీబాల దేవి, తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా సునీత మోహన్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సాయిశేఖర్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా ఎస్. వినోద్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.


SAKSHITHA NEWS