SAKSHITHA NEWS

వృద్ధురాలిని చంపి తిన్న వీధి కుక్కలు

రాజన్న జిల్లా:
వీధి కుక్కల దారుణాలు నానాటికీ పెరిగిపోతు న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు చంపి పలు భాగాలను తినేశాయి.

పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసే సరికి ముఖం గుర్తుపట్ట లేనంతగా ఛిద్రమైంది. ఊళ్లో కుక్కల నోళ్లకు రక్తం ఉండ టాన్ని వారు గుర్తించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…


SAKSHITHA NEWS