SAKSHITHA NEWS

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

సీఐ ముత్యాల. సత్యనారాయణ

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ,ఇబ్రహీంపట్నం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల. సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు కానీ వివాదాస్పద పోస్టులు గాని పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా సభలు,సమావేశాలు నిర్వహించాలి అంటే అందుకుగాను తగిన అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని 93 పోలింగ్ బూతులలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడతామని తెలియజేయడం జరిగింది.


SAKSHITHA NEWS