SAKSHITHA NEWS

పెనుకొండ నియోజకవర్గం లో 11వ రోజు కొనసాగిన సామూహిక నిరాహార దీక్షలు

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని రొద్దం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలొ పాల్గొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జి పార్థసారథి అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని.. ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసులపై అన్ని మార్గాల్లో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. జరుగుతున్న పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, అక్రమ కేసులను కొట్టివేయాలంటూ పైకోర్టులను ఆశ్రయించడంతో పాటు ప్రజా పోరాటాలనూ ఉద్ధృతం చేస్తామని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేసారు ఈ కార్యక్రమంలొ తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


SAKSHITHA NEWS