SAKSHITHA NEWS

20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక‌ విడుదల‌ చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము

నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20 సంవత్సరాల కలర్ ప్రత్యేక సంచికను ప్రింట్ చేసి గుడివాడ శాసనసభ్యలు వెనిగండ్ల రాము,మాజీ శాసన సభ్యులు రావి వెంకటేశ్వరరావు,గుడివాడ నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పలువురు టి.డి.పి నాయకుల మధ్య ఆవిష్కరించారు.ఈ సంచికలో ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము ప్రత్యేక కధనాన్ని ప్రచురించిన‌ సందర్భంలో వారి కధనంతో ఉన్న సంచికను చూసి,నవ జనత దినపత్రిక రానున్న రోజుల్లో దిన దినాభి వృద్ది చెందాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో పలు ప్రత్యక కథనాలను,ప్రజలకు సమాజానికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కడియాల గణేష్,జిల్లా బ్యూరో రాజేష్,పలువురు టి.డి.పి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS