భారతీయ జనతా పార్టీ దుండిగల్ సర్కిల్
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ నాంపల్లి నందు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని రెండు రోజుల నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది
తెలంగాణ వ్యాప్తంగా పేద మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక నానా అవస్థలు పడుతున్న విద్యార్థిలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ తన గుప్పిట్లో పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థుల కడుపు కొడుతున్నాడు వెంటనే ఆ యొక్క ఫీజులు బకాయిలు చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్షకు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల హక్కుల సాధనకై బిజెపి పోరాటానికి మద్దతుగా దుండిగల్ సర్కిల్ బీజేపీ నాయకులు అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏ మల్లేష్ యాదవ్ మాజీ అధ్యక్షులు గోనె మల్లారెడ్డి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ఎంబరి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
