మరిన్ని ప్రయోజనాలకు దీపావళితో స్వాగతం
** చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
….
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఆర్ధిక ప్రయోజనాల కోసం “గూగుల్ ” సంస్థ దీపావళితో స్వాగతం పలికిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
21వ శతాబ్దపు అదృశ్య నాడి గూగుల్….
భారతదేశ తూర్పు డిజిటల్ విప్లవానికి విశాఖపట్నం నాయకత్వం వహించనుందని తెలిపారు. గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ భవిత మారనుందని ఉద్ఘాటించారు. గ్రీన్ డిజిటల్ పవర్ కి ఏపీ నమూనా రాష్ట్రంగా ఆవిర్భవించ గలదని అభిప్రాయపడ్డారు.
గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కడుతున్న నేపథ్యంలో దీపావళి పర్వదినాన చిత్తూరు ఎంపీ స్పందించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ రావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితోనే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన
దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు ధన్యవాదాలు తెలపడంతో పాటు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రపంచానికి భారతదేశం ఓ గుండె లాగా గూగుల్ సేవలు అందిస్తూ..,దేశ తూర్పు సముద్ర తీరాన్ని పునర్నిర్వచించగల ఇంజన్ లా పనిచేస్తుందన్నారు. డిజిటల్ యుగం రిఫైనరీగా విశాఖపట్నం మారడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక గిగావాట్ సెంటర్ అనేది పవర్ ప్లాంట్ కి సమానమైన సాంకేతికతో కూడిన 21వ శతాబ్దపు అదృశ్య జీవనాడిగా వినియోగింపబడుతుందని చెప్పారు. కేవలం నిర్మాణంలోనే దాదాపు 1,700 మంది కార్మికులు పని చేస్తారనీ.., స్థానిక యువతకు స్థిరమైన జీవనోపాధిని, శిక్షణను అందించి, నిరుద్యోగ యువత ఉజ్వల భవితకు బాటలు వేయనుందన్నారు.
సాంకేతిక, పరిపాలనా.., నిర్వహణ పాత్రలలో శాశ్వత స్థానాలను కలిగి ఉంటుందని చిత్తూరు ఎంపీ తెలిపారు. డేటా సెంటర్ లోపల ప్రతి ఉద్యోగం దాని వెలుపల 7.4 శాతం అదనపు ఉద్యోగాలను సృష్టించగలదని పేర్కొన్నారు. ఇది లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతటా వేలాది జీవనోపాధి, బిలియన్ల రూపాయలు మౌలిక సదుపాయాలు, పరికరాలు, పునరుత్పాదక ఇంధనం, నిర్మాణాలకు బీజం పడిందన్నారు. రెస్టారెంట్లు, హౌసింగ్ మార్కెట్లు, సర్వీస్ ప్రొవైడర్లు , రవాణా సంస్థలు అభివృద్ధి చెందుతాయని,.
విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థ ఓడరేవులు, తయారీ వంటి సాంప్రదాయ పరిశ్రమలకు మించి వైవిధ్యభరితంగా మారడంతో పాటు డిజిటల్ ఎక్సలెన్స్ కేంద్రంగా రూపాంతరం చెందనుందన్నారు.
ఇది మరింత ఆశాజనకంగా ఉంటుందని, డేటా సెంటర్లలోని అనేక కార్యాచరణ ఉద్యోగాలు సంవత్సరానికి 100,000 కంటే ఎక్కువ సృష్టించేందుకు వీలవుతుందన్నారు.
కొన్ని అధికారిక డిగ్రీలు, నైపుణ్యాలు, నిబద్ధత అవసరమని చెప్పారు.
