మాతా వైష్ణోదేవి అమ్మవారికి వాహనాల అందజేసిన వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు జమ్మూ లోని కట్రా లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం “శ్రీ మాతా వైష్ణో దేవి’ అమ్మవారికి రెండు వాహనాలను విరాళంగా ఇచ్చారు.ఈ మేరకు ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయంలో వివిధ అవసరాల నిమిత్తం అధికారులకు రెండు వాహనాలు అందజేశారు.

