సత్యమేవ జయతే యూట్యూబ్ ఛానల్ బ్రోచర్ ఆవిష్కరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతిలో నూతనంగా ప్రారంభమవుతున్న “సత్యమేవ జయతే” యూట్యూబ్ ఛానల్ బ్రోచర్ను తుడా చైర్మన్, తితిదే ఎక్స్అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
“యువత తమ సృజనాత్మకతను ప్రపంచానికి చూపించడానికి యూట్యూబ్ ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తోంది. సామాజిక సమస్యలపై అవగాహన పెంపుతో పాటు, ఎన్నికలు, రాజకీయాలు మరియు దేశాభివృద్ధి వంటి అంశాలపై చైతన్యం సృష్టించడంలో ఇలాంటి వేదికలు కీలకంగా మారుతున్నాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే యూట్యూబ్ ఛానల్ స్థాపకులు శ్యామ్, ధనంజయ, పవన్ పాల్గొన్నారు.
