జిల్లాలో రేపు కూడా పాఠశాలలు,కాలేజీలకు సెలవు
…..
సాక్షిత : పల్నాడు జిల్లా 29వ తేదీ అనగా రేపు బుధవారం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు,అంగన్వాడీ పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రకటన ద్వారా తెలిపారు.మొంథా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు,కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
