వినియోగదారుల సంఘం ఫిర్యాదుతో చీరాల రోడ్ ను బాగు చేసిన జాతీయ రహదారి అధికారులు

Sakshitha news

వినియోగదారుల సంఘం ఫిర్యాదుతో చీరాల రోడ్ ను బాగు చేసిన జాతీయ రహదారి అధికారులు

పట్టణంలో కళామందిర్ సెంటర్ నుంచి చీరాల వెళ్ళు జాతీయ రహదారి గుంటలు పడి రెండు సంవత్సరాలు అయింది. జాతీయ రహదారి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం తెలుసుకున్న కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫారం ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఫిర్యాదు నెంబర్ PLND 2025103036 గా నమోదు చేయడంతో జాతీయ రహదారి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఈ రోడ్డును జాతీయ రహదారి అధికారులు బాగు చేశారు.
పట్టణానికి అనేక గ్రామాల నుంచి వచ్చే రహదారి కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Scroll to Top