చిలుకూరు లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..
సాక్షిత: చిలుకూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ధ్రువకుమార్, పోలీస్ స్టేషన్లో హనుమా నాయక్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అలాగే మండల పరిషత్లో ఎంపీడీవో నరసింహారావు, ఏవో కార్యాలయంలో శ్రీధర్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
