దత్తాత్రేయ జయంతి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ …
▪️భక్తులతో కలిసి అన్నప్రసాద సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ …
▪️పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిరంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా వారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు,అభివృద్ధి కోసం ప్రత్యేక పూజాలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. సేవా భావం మరియు సత్యం,ధర్మం, దయా,సేవా,మార్గంలో నడవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, సేవాదళ సభ్యులు పాలున్నారు…

