ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Sakshitha news

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, నాయకులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు వారు సానుకూలంగా స్పందించారు. వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు..

అదే విధంగా పలు ప్రాంతాలలో జరగబోయే వివిధ శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు..