విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి:రాష్ట్రపతి
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు.ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు.ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని ద్రౌపదీ ముర్ము అన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
