మృతురాలి దహన సంస్కాల కోసం ఆర్థిక సహాయం అందజేసిన….. రావుల చంద్రశేఖర్ రెడ్డి
*సాక్షిత వనపర్తి :వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన మాజీ మండల సమైక్య అధ్యక్షురాలు చిట్టెమ్మ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి సంఘటన పట్ల దిగ్భ్రాంతిని చిట్టెమ్మ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆమె అంతిమ దహన సంస్కారాల కోసం కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మండల నాయకులు మాణిక్యం ద్వారా మృతురాలి కుటుంబానికి అందజేస్తూ ఆమె ఆత్మకు శాంతిని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గ్రామస్తులు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
