ఓట్ల చోరీ రాహుల్ గాంధీనినాదానికి మద్దతుగా రామన్ పాడు లో 100 మంది ఓటర్ల సంతకాల సేకరణ ………………..*ఎండి.అంజాద్ ఆలి టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కార్య దర్షి
సాక్షిత వనపర్తి :
రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ నినాదం కార్యక్రమానికి, మద్దతుగా టీపీసీసీ మరియు దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం ప్రతి గ్రామ పరిధిలో 100 మంది ఓటరులతో రాహుల్ గాంధీకి మద్దతు గా రామన్ పాడు గ్రామంలో ఎండీ అంజాద్ అలీ సంతకాల సేకరణ చెప్పటి, మధునాపురం మండల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ చుక్క మహేష్ మంగళవారం సంతకాల సేకరణ ఫారలు అందించడం జరిగింది.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కూడా, ఒకే ఒక సీటు గెలవడమే ఈవీఎం ట్యాంపరింగ్ కు సూచిక ని అన్నారు. బీహార్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర చేపట్టి ప్రజలను చైతన్య పరచడంతో ఎన్నికల సంఘం కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించిందని రాహుల్ గాంధీ విజయమని అన్నారు…
