శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో పిసిసి జనరల్ సెక్రెటరీ గోవిందరావు ప్రత్యేక పూజలు
….
సాక్షిత శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో బుధవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గోవిందరావు కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు స్వామి, చైర్మన్ గోపాల్ రెడ్డి, అన్నదాన కమిటీ చైర్మన్ దర్శన్ గౌడ్, అర్చకులు సాయిశివ వారిని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
