అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమం
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చంటి పిల్లలు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు,అంగన్వాడీలో ఇస్తున్న పోషక విలువలతో కూడిన పదార్థాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఓ సుబ్బలక్ష్మి తెలిపారు.సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండల పరిధి యండ్లపల్లి సెక్టార్ లో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుబ్బలక్ష్మి,సూపెర్వైజర్ జ్యోతి, పాల్గొని పలు సూచనలు చేశారు. పలువురు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని తల్లులకు పోషక ఆహారం పై అవగాహన కల్పించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
