రామగుండం సీఎస్ఆర్ కార్యక్రమంలో 500 బ్లీచింగ్ పౌడర్ సంచులు పంపిణీ చేసిన ఎన్టీపీసీ…
25 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లకు సరఫరా…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం: ఎన్టీపీసీ రామగుండం తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సుమారు 25 ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాలు (PAVs) మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ డివిజన్లకు సుమారు 500 బ్లీచింగ్ పౌడర్ సంచులను పంపిణీ చేసింది.
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ ముందస్తు చర్యను చేపట్టినట్లు సంస్థ తెలిపింది. బ్లీచింగ్ పౌడర్ పంపిణీతో స్థానిక అధికారులు శుద్ధి, పారిశుద్ధ్య చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకారం అందనుంది. దీంతో దోమల పెంపకాన్ని నియంత్రించడంతో పాటు డెంగ్యూ, మలేరియా, ఇతర కాలానుగుణ అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో ఇది ఉపయోగపడనుంది.
సమాజ సంక్షేమం, ప్రజారోగ్యం, పర్యావరణ భద్రత పట్ల తన నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీపీసీ రామగుండం మరోసారి చాటుకుంది. పరిసర ప్రాంత ప్రజలకు మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన జీవన వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని సంస్థ పేర్కొంది.

