జాతీయ రోడ్డు భద్రత జాగ్రత్తలు పాటించాలి…ఎస్సై హనుమాన్ నాయక్…
సాక్షిత ప్రతినిధి : చిలుకూరు పరిధిలోని కవితా కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహాన కల్పిస్తున్న ఎస్ఐ హనుమాన్ నాయక్..
వాహానాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు పాటించాలని
చిలుకూరు ఎస్ఐ హనుమాన్ నాయక్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా చిలుకూరు కవితా జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణం చాలా విలువైనదని డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదని, మధ్యం సేదించి డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
