డా. వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,ప్రగతినగర్ డివిజన్ (276) లో వైఎస్సార్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన 77వ జయంతి వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి దివంగత రాజశేఖర్ రెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసారు.
పేద ప్రజలకు రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ప్రగతినగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి),సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, ఎ వి రెడ్డి, వీరబాబు గౌడ్, డా. మద్ది నారాయణ రెడ్డి, బండ్ల విజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, పర్వతిని ఆంజనేయ వర్మ,బత్తుల చిరంజీవి,జెగ్గా మధుసూదన్ రెడ్డి,సయ్యద్ రఫత్, దాసరి మహేష్,మేడ శ్రీను,సురేందర్ యాదవ్,రవీందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

