తమ్మర వాగును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..
వరద ముప్పు నివారణకు ముందస్తు చర్యలు…
జేసీబీలతో చెత్త తొలగింపు పనుల ప్రారంభం
సాక్షిత : కోదాడ మున్సిపల్ పరిధిలో ప్రవహిస్తున్న తమ్మర వాగు కారణంగా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో కురిసిన భారీ వర్షాల సమయంలో తమ్మర వాగు ఉప్పొంగి పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మాజీ సర్పంచ్ तथा కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్నేని వెంకట్ రత్నం బాబు, స్థానిక కౌన్సిలర్ నర్సయ్య కలిసి తమ్మర వాగును గురువారం పరిశీలించారు.
వాగులో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి, కలుపు మొక్కలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయని గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. జేసీబీల సహాయంతో వాగులోని చెత్తను తొలగించే పనులను ప్రారంభించారు. వర్షాకాలంలో వరద నీరు కాలనీల్లోకి చేరకుండా, నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్య నారాయణ కమిషనర్ రమాదేవి లుమాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా వర్షాకాలానికి ముందే వాగుల శుభ్రత పనులు చేపడుతున్నామని చెప్పారు. ఎర్నేని వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌన్సిలర్ నర్సయ్య స్థానిక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ్మర వాగు పరిసరాల్లో మరిన్ని అభివృద్ధి, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్నేని వెంకటరత్నం బాబు కమిషన్ వార్డ్ కౌన్సిలర్ నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెల కృష్ణారావు ,చావా హరినాథ్, ధన మూర్తి ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
