ఎం.ఎన్.రెడ్డి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ

Sakshitha news

ఎం.ఎన్.రెడ్డి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ డివిజన్లోని ఎమ్.ఎన్.రెడ్డి నగర్ వాసులు ఎదుర్కొంటున్న ఇంటి రిజిస్ట్రేషన్లు మరియు వారి స్థలాలను ప్రోహిబిటెడ్ జాబితా ( నిషేధిత జాబితా) చేర్చడం చేత సుమారు 150 కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను శ్రీశైలం గౌడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు*..

వారి సమస్య పూర్తిగా విన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి వారి ఇంటి స్థలాలు ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చిన స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ గారు ఆ జాబితా నుండి తొలగించేందుకు చర్యలు చేపడతానని తెలిపారు…

ఈ కార్యక్రమంలో ఎం.ఎన్.రెడ్డి నగర్ కాలనీల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, శంకర్, రమేష్,రామణ, సుధాకర్ బాబు,బాలలింగం తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top