అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్సి ఇంచార్జ్ దొడ్డాకుల గిరిబాబు ను పరామర్శించిన : ఎమ్మెల్యే జారే

Sakshitha news

అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్సి ఇంచార్జ్ దొడ్డాకుల గిరిబాబు ను పరామర్శించిన : ఎమ్మెల్యే జారే

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గంలో
అకుంఠిత దీక్షాపరుడు పట్టు వదలని విక్రమార్కుడు ఒక్కసారి యాదికొచ్చిన పని పూర్తయ్యే వరకు వెంటబడి చేయించగల సత్తా కలిగిన నాయకుడు పరిచయం అవసరం లేని యంగ్ అండ్ డైనమిక్ అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మన తెలంగాణ ఆర్సి ఇంచార్జ్ దొడ్డాకుల గిరిబాబు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి అప్పారావు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి పూర్తిస్థాయిలో వైద్య చికిత్సలు అందించేందుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిమ్స్ హాస్పటల్లో ప్రత్యేకంగా ఓ డాక్టర్ని ఏర్పాటు చేయించి దగ్గరుండి వైద్య చికిత్సలను అందజేయించారు. మెరుగైన కొన్ని వైద్య పరీక్షలు చికిత్సలు కోసం హైదరాబాదులోని కిమ్స్ (ప్రైవేట్ హాస్పటల్) లో అందజేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మనిషి మీద ఇంట్రెస్ట్ పెడితే ఇంతలా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా ఆ జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మా మీడియా మిత్రుల అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

Scroll to Top